మల్లన్నసాగర్​లో షూటింగ్​లు చేయండి

మల్లన్నసాగర్​లో షూటింగ్​లు చేయండి
  • భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్​లో కోరిన కేటీఆర్

హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం పుణ్యమా అని ఇక నుంచి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ లోనూ సినిమా షూటింగ్​లు చేయవచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ రిజర్వాయర్ల దగ్గర షూటింగ్ లు చేయాలని పవన్ కల్యాణ్ ను కోరారు. బుధవారం హైదరాబాద్​లో జరిగిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్​లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్​లోని సినిమా ఇండస్ట్రీ దినదినాభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశ సినీ ఇండస్ట్రీకే హైదరాబాద్ కేంద్రంగా మారుతుందన్న నమ్మకం ఉందన్నారు. ‘‘కాళేశ్వరంలో అతి ముఖ్యమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్​ను సీఎం కేసీఆర్ ఈరోజే ప్రారంభించారు. ఇక నుంచి ఏపీలోని గోదావరి జిల్లాల్లో లాగే తెలంగాణ జిల్లాల్లోనూ షూటింగ్​లు చేయొచ్చు” అని కేటీఆర్ చెప్పారు. భీమ్లా నాయక్​తో ఎంతో మంది కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చారని సినిమా యూనిట్ ను అభినందించారు.