- భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్లో కోరిన కేటీఆర్
హైదరాబాద్, వెలుగు: కాళేశ్వరం పుణ్యమా అని ఇక నుంచి మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ లోనూ సినిమా షూటింగ్లు చేయవచ్చని మంత్రి కేటీఆర్ అన్నారు. ఆ రిజర్వాయర్ల దగ్గర షూటింగ్ లు చేయాలని పవన్ కల్యాణ్ ను కోరారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన భీమ్లా నాయక్ ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో హైదరాబాద్లోని సినిమా ఇండస్ట్రీ దినదినాభివృద్ధి చెందుతోందని అన్నారు. దేశ సినీ ఇండస్ట్రీకే హైదరాబాద్ కేంద్రంగా మారుతుందన్న నమ్మకం ఉందన్నారు. ‘‘కాళేశ్వరంలో అతి ముఖ్యమైన మల్లన్నసాగర్ రిజర్వాయర్ను సీఎం కేసీఆర్ ఈరోజే ప్రారంభించారు. ఇక నుంచి ఏపీలోని గోదావరి జిల్లాల్లో లాగే తెలంగాణ జిల్లాల్లోనూ షూటింగ్లు చేయొచ్చు” అని కేటీఆర్ చెప్పారు. భీమ్లా నాయక్తో ఎంతో మంది కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చారని సినిమా యూనిట్ ను అభినందించారు.