వైష్ణవి హాస్పిటల్ MD సూసైడ్.. డైరీలో నలుగురు పేర్లు

వైష్ణవి హాస్పిటల్ MD సూసైడ్.. డైరీలో నలుగురు పేర్లు

హైదరాబాద్ ఎల్బీ నగర్ లో అజయ్ కుమార్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకున్నాడు. LB నగర్ సాగర్ రింగ్ రోడ్ లోని వైష్ణవి హాస్పిటల్ MD అజయ్… తనని కొందరు వేధిస్తున్నారంటూ సూసైడ్ లెటర్ రాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాస్పిటల్ బిల్డింగ్ ఓనర్ కరుణా రెడ్డి, బిల్డింగ్ ఓనర్ బామ్మర్ధి కొండల్ రెడ్డి, తుర్కయంజాల్ కు చెందిన శివకుమార్, సరస్వతి నగర్ కాలనీకి చెందిన మెగారెడ్డి పేర్లు తన డైరీలో రాసి సూసైడ్ చేసుకున్నాడు. వీరంతా తనని మానసికంగా వేధించడంతోనే ఆత్మహత్య  చేసుకుంటున్నానని డైరీలో రాశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.