స్నేహితుడికి కాల్ చేసి డాక్టర్ ఆత్మహత్య

స్నేహితుడికి కాల్ చేసి డాక్టర్ ఆత్మహత్య

ఓ డాక్టర్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తనకు తానే విషం ఎక్కించుకొని ప్రాణం తీసుకున్నాడు. ఈ విషాదకర ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే.. ఏపీలోని కడప జిల్లా బద్వేలుకు చెందిన డాక్టర్ రాజ్ కుమార్ అమీర్ పేట శ్యామ్ కరణ్ రోడ్డులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో డాక్టర్ గా పనిచేస్తున్నారు. బీకే గుడాలో నివాసం ఉంటున్న రాజ్ కుమార్.. ఓ ఇంటిలో అద్దెకు నివాసం ఉంటున్నారు. 

శుక్రవారం స్నేహితుడికి ఫోన్‌ చేసిన రాజ్ కుమార్ తన మనసు బాగోలేదంటూ పలు విషయాలు చెప్పాడు. అనంతరం కాసేపటికే స్నేహితుడు తిరిగి ఫోన్‌ చేసినా రాజ్ కుమార్ స్పందించలేదు. దీంతో అనుమానం వచ్చిన రాజ్ కుమార్ ఫ్రెండ్ మరో వైద్యుడు శ్రీకాంత్‌కు సమాచారమిచ్చాడు. అతను హుటాహుటిన వచ్చి చూడగా.. రాజ్‌కుమార్‌ తన చేతికి సెలైన్‌ బాటిల్‌ పెట్టుకుని అపస్మారక స్థితిలో పడి ఉన్నాడు.  దీంతో అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. 

రాజ్ కుమార్ తండ్రి కొండిపల్లి సుబ్బారావు ఫిర్యాదుతో.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సెలైన్‌లో విషం ఎక్కించుకుని రాజ్ కుమార్ మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. అయితే అతని ఆత్మహత్యకు కారణాలు ఏంటో ఇంకా తెలియలేదు. దీంతో పోలీసులు రాజ్ కుమార్ స్నేహితుల్ని విచారిస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.