చిత్రలహరి కలిపింది ఇద్దరినీ.. ‘దూరదర్శిని’ ట్రైలర్ రిలీజ్

చిత్రలహరి కలిపింది ఇద్దరినీ.. ‘దూరదర్శిని’ ట్రైలర్ రిలీజ్

సువిక్షిత్‌‌, గీతికా రతన్‌‌ జంటగా  యదార్థ సంఘటన ఆధారంగా రూపొందుతోన్న ఫీల్‌‌గుడ్‌‌ లవ్‌‌ ఎంటర్‌‌టైనర్‌‌ ‘దూరదర్శిని’. కలిపింది ఇద్దరినీ ట్యాగ్‌‌లైన్. కార్తికేయ కొమ్మి దర్శకత్వంలో జయ శంకర్‌‌ రెడ్డి ఎం, పాటిమీది సంతోష్‌‌ ఈ చిత్రాన్ని నిర్మించారు.

మే 15న సినిమా  విడుదల కానుంది. తాజాగా ట్రైలర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. 90స్‌‌లోని మెమరీస్‌‌ను గుర్తుచేసేలా సాగిన ట్రైలర్ ఆకట్టుకుంది.  దూరదర్శిన్‌లో వచ్చే చిత్రలహరి కార్యక్రమం ఈ ప్రేమికులిద్దరినీ కలపడం, తర్వాత పెద్ద వాళ్ల నుంచి ఎదురయ్యే సమస్యలతో యూత్‌‌కు కనెక్ట్ అయ్యేలా ట్రైలర్‌‌‌‌ను కట్ చేశారు.

ఈ సందర్భంగా  దర్శకుడు కార్తికేయ మాట్లాడుతూ.. ‘అందరి మనసులను హత్తుకునే సినిమా ఇది.   పల్లెటూరులో విహరించిన అనుభూతి కలుగుతుంది.  పాత జ్క్షాపకాలు గుర్తుకుతెస్తుంది. తల్లిదండ్రులకు, యూత్‌‌కు, సమాజానికి నచ్చే అంశాలు ఉన్నాయి’ అని అన్నాడు. యదార్థ సంఘటన చుట్టు అల్లుకున్న ఈ కథ ఎమోషనల్‌‌గా సాగుతుంది అని హీరో సువిక్షిత్ చెప్పాడు.