కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో వ్యాస రచన పోటీలు

కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలో వ్యాస రచన పోటీలు

ముషీరాబాద్, వెలుగు: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ఆధ్వర్యంలో మంగళవారం కాకా బీఆర్ అంబేద్కర్ కాలేజీలోని స్టూడెంట్లకు ‘సంపూర్ణ ఆరోగ్యానికి యోగా’ అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. 

ఈ పోటీల్లో భారీ సంఖ్యలో స్టూడెంట్లు పాల్గొన్నారని మేనేజ్​మెంట్ తెలిపింది. విజేతలకు బుధవారం కాలేజీ ఆవరణలో మెమొంటోలు, సర్టిఫికెట్లు అందజేస్తామని పేర్కొంది. కార్యక్రమంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ డైరెక్టర్ ఇనుముల హరిబాబు, అంబేద్కర్ కాలేజీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీధర్, కుమార స్వామి, మాధవి పాల్గొన్నారు.