
న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ విజయోత్సవ వేడుకల్లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించడంపై టీమిండియా లెజెండ్ బ్యాటర్ రాహుల్ ద్రవిడ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. జరిగిన సంఘటన చాలా దురదృష్టకరం, విచారకరమైందన్నాడు. ‘ఆ సంఘటన నన్ను చాలా కలిచి వేసింది. చాలా విచారకరం. ప్రజల గురించే ఆలోచనలు వస్తున్నాయి’ అని ద్రవిడ్ పేర్కొన్నాడు. అత్యంత ఎక్కువ క్రీడా సంస్కృతిని కలిగిన బెంగళూరులో ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉందన్నాడు.
‘క్రీడలపై ఎక్కువ ఆసక్తి కలిగిన నగరం ఇది. నేనూ ఇక్కడి నుంచే వచ్చాను. ఒక క్రికెట్ను మాత్రమే కాకుండా చాలా క్రీడలను ప్రజలను ఇష్టపడతారు. ఇక్కడి ప్రజలు అన్ని క్రీడలను అనుసరిస్తారు. అది ఫుట్బాల్ అయినా, కబడ్డీ అయినా అందరూ ఇష్టపడతారు. ఆర్సీబీ కూడా అన్ని అంశాలను చాలా బాగా ఫాలో అవుతుంది. కానీ ఆ సంఘటన ఎలా జరిగిందో అర్థం కావడం లేదు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నా’ అని ద్రవిడ్ వ్యాఖ్యానించాడు.