మద్యం మత్తులో మహిళల వీరంగం.. పోలీసుల ముందే హల్చల్

మద్యం మత్తులో మహిళల వీరంగం.. పోలీసుల ముందే హల్చల్

సికింద్రాబాద్: మద్యం మత్తులో ఇద్దరు మహిళలు హ‌ల్‌చ‌ల్ చేశారు. సికింద్రాబాద్ లో పాస్ పోర్ట్ కార్యాలయం ఎదురుగా ఆగి ఉన్న కారు వద్దకు వచ్చి, కారు యజమానిని రూ.10 రూపాయలు ఇవ్వమని అడిగారు. అత‌ను లేవని తెలుపడంతో మద్యం మత్తులో ఉన్న వారు రెచ్చిపోయి.. నానా బూతులు తిడుతూ కారు పై రాయి తో దాడి చేశారు. అద్దం పగిలిన కారులోని వ్యక్తిని బయటికి లాగి నానా హంగామా సృష్టించారు. అక్కడికి చేరుకున్న పోలీసులను కూడా వారు లెక్క చేయలేదు. వారి ముందే మరింత రెచ్చి పోయారు. ఒక వైపు కరోన భయం, మరొక వైపు మహిళలు కావడంతో పోలీసులు కూడా ఏమి చేయలేని పరిస్థితి నెలకొంది. పోలీసులు వారిని‌ వారించే ప్రయత్నం చేశారు.