మేనకా గాంధీకి EC వార్నింగ్: అలాంటి కామెంట్లు వద్దు

మేనకా గాంధీకి EC వార్నింగ్: అలాంటి కామెంట్లు వద్దు

కేంద్ర మంత్రి మేనకా గాంధీ కి కేంద్ర ఎన్నికల కమిషన్​ సోమవారం వార్నింగ్ ఇచ్చింది. తమ పార్టీకి పడిన ఓట్లను బట్టి ఎబీసీడీ కేటగిరీ లుగా గ్రామాలను విభజిం చి అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని చేసిన కామెం ట్లపై మండిపడింది.ఆమె ప్రతిపాదిం చిన ఎబీసీడీ ఫార్ములాను తీవ్రంగా ఖండించింది. తమ పార్టీకి ఎక్కువశాతం ఓట్లు పడిన గ్రామాల్లో ముం దుగా అభివృద్ధి పనులు చేపడతామంటూ ఈ నెల14న యూపీలోని ఫిలిబిత్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో మేనక ఈ కామెంట్ స్ చేశారు. దీని పై ఇప్పటికే 48గంటల పాటు ప్రచారంలో పాల్గొ నకుండా ఈసీ సస్పె న్షన్ వేటు వేసింది. ఈ కామెంట్స్ ఎన్నికల కోడ్​ ఉల్లం ఘన కిందకే వస్తాయని, ఇలాంటి కామెంట్లు రిపీట్ చేయొద్దని ఈసీ మరోసారి హెచ్చరించింది.