తమిళనాడులో ఈడీ దాడులు.. నిర్మాత, డైరెక్టర్ ఇళ్లలో కీలక పత్రాలు స్వాధీనం

తమిళనాడులో ఈడీ దాడులు.. నిర్మాత, డైరెక్టర్ ఇళ్లలో కీలక పత్రాలు స్వాధీనం

తమిళనాడులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దాడులు చేపట్టింది. సినీ నిర్మాత, మాజీ డీఎంకే లీడర్ జాఫర్ సిద్దిఖ్, ఇతరులకు సంబంధించిన డ్రగ్స్ మనీలాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఏప్రిల్ 9వ తేదీ మంగళవారం తెల్లవారుజము నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పిఎంఎల్‌ఎ) నిబంధనల ప్రకారం రాష్ట్ర రాజధాని చెన్నై, మదురై, తిరుచిరాపల్లిలోని 25 లోకేషన్లలో  కేంద్ర పారామిలటరీ బలగాల ఎస్కార్ట్‌తో సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు.

36 ఏళ్ల సాదిక్‌  తో సంబంధమున్న దర్శకుడు అమీర్‌, మరికొంతమంది నివాసాలల్లో సోదాలు చేసి పలు కీలక పత్రాలను స్వాధీన చేసుకున్నారు ఈడీ అధికారులు. సాదిక్‌ను గత నెలలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) అరెస్టు చేసింది. రూ. 2 వేల కోట్లకు పైగా విలువైన సుమారు 3,500 కిలోల సూడోపెడ్రిన్ అక్రమ రవాణాలో సాదిక్ ప్రమేయం ఉందని వచ్చిన ఆరోపణల క్రమంలో ఆయనను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.