
- సీబీఐ నమోదు చేసిన కేసు ఆధారంగా దర్యాప్తు
న్యూఢిల్లీ: ప్రముఖ పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి చెందిన సంస్థల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం సోదాలు నిర్వహించింది. ఢిల్లీ, ముంబైలోని ఆయన గ్రూపు సంస్థలకు చెందిన మొత్తం 40ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేపట్టారు.
50కిపైగా సంస్థలపై దాడులు చేసి రికార్డులను పరిశీలించారు. 25మందికిపైగా వ్యక్తులను ప్రశ్నించారు. రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూప్ కు చెందిన రాగా కంపెనీల ఆర్థిక లావాదేవీలపై యెస్ బ్యాంకు కేసులో సీబీఐ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తోంది.
2017, 2019 మధ్య కాలంలో ఆ బ్యాంకు నుంచి రుణాలుగా పొందిన రూ.3వేల కోట్లను మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు సీబీఐ కేసు నమోదు చేసింది. ప్రమోటర్లు, ప్రజల సొమ్మును పక్కదారి పట్టించేందుకు పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించి బ్యాంకు ఉద్యోగులకు లంచం ఇచ్చినట్టు కూడా ఈడీ ప్రాథమికంగా గుర్తించినట్టు సమాచారం.