టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు ఏకలవ్య అవార్డు

టీమిండియా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కు ఏకలవ్య అవార్డు

టీమిండియాకు  T 20 క్రికెట్ లో వైస్ కెప్టెన్ గా నియమితుడైన కర్ణాటక స్టార్ క్రికెటర్ కేఎల్ రాహుల్ ను ఏకలవ్య అవార్డు వరించింది. కర్ణాటక ప్రభుత్వం క్రీడల్లో ప్రదానం చేసే అత్యుత్తమ పురస్కారం ‘ఏకలవ్య’. గత కొన్నేళ్లుగా అద్భుతమైన ఆటతీరుతో ఇంటర్నేషనల్ క్రికెట్లో రాణిస్తున్న కేఎల్ రాహుల్ ను  ఈ అవార్డుకు ఎంపిక చేసినట్టు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. ఈ విషయాన్ని కేఎల్ రాహుల్ ట్విట్టర్ ట్వీట్ చేశాడు.

రాష్ట్ర అత్యున్నత పురస్కారం అందిస్తున్నందుకు కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపాడు రాహుల్. అయితే… తాను ఈ స్థాయికి వచ్చానంటే అందుకు తన కోచ్ లు, జట్టు సభ్యులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల సహకారమే కారణమని, వారు లేకుండా తన అభ్యున్నతి సాధ్యమయ్యేది కాదన్నాడు. భవిష్యత్తులోనూ మరింతగా శ్రమించి కర్ణాటకకు, దేశానికి మరింత పేరు తెస్తానంటూ ట్విట్టర్ లో  తెలిపాడు రాహుల్ .