కొడుకు పెద్ద ఐటీ కంపెనీలో డైరెక్టర్..: వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు ఆత్మహత్య

కొడుకు పెద్ద ఐటీ కంపెనీలో డైరెక్టర్..: వృద్ధాశ్రమంలో తల్లిదండ్రులు ఆత్మహత్య

కృష్ణమూరికి 81 ఏళ్లు.. రాధాకు 74 ఏళ్లు.. ఇద్దరూ భార్యభర్తలు. వీరికి ఓ కుమారుడు.. పేరు విజయ్.. బెంగళూరు సిటీలోని ఓ పెద్ద ఐటీ కంపెనీలో ఉద్యోగి మాత్రమే కాదు.. పెద్ద హోదాలో ఆ కంపెనీకి డైరెక్టర్‎గా కూడా ఉన్నారు. ఇంట్లో కోడలుతో తరచూ గొడవలు జరుగుతుండటంతో.. వృద్ధాశ్రమంలో చేర్పించాడు ఆ కొడుకు. అక్కడ ఉండలేక.. ఇంట్లో కొడుకు దగ్గర ఉండలేక.. తీవ్ర మనోవేదనతో వృద్ధాశ్రమంలోనే.. ఒకే ఫ్యాన్‎కు.. ఒకే తాడుకు ఇద్దరూ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

బెంగళూరులోని తలఘట్టపురలోని కమలమ్మ రామకృష్ణప్ప వృద్ధాశ్రమంలో వృద్ధ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులను ఆర్ కృష్ణమూర్తి (81),కె రాధ (74)గా పోలీసులు గుర్తించారు. తమిళనాడులోని మధురైకి చెందిన వీరికి కుమారుడు విజయ్ ఉన్నాడు. విజయ్ బెంగుళూరులో ఒక టెక్ కంపెనీ డైరెక్టర్‎గా పని చేస్తున్నాడు. ఫ్యామిలీతో కలిసి బెంగుళూరు సిటీలో నివసిస్తున్నాడు విజయ్. అయితే, విజయ్ భార్యకు అతడి తల్లిదండ్రులకు మధ్య విభేదాలు తలెత్తాయి. 

దీంతో పేరెంట్స్‎ను ఓల్డ్‎ఏజ్ హోమ్‎లో పంపించాడు. వృద్ధాశ్రమంలో ఉండలేక.. ఇటు కనిపెంచిన కొడుకు దగ్గర ఉండలేక.. మరోవైపు కొడుకు భార్యతో గొడవలు.. ఇవన్నింటితో విగిసిపోయిన ఆ వృద్ధ దంపతులు ఇక చావే శరణమనుకున్నారు. వెంటనే వృద్ధా్శ్రమంలోనే ఫ్యాన్‎కు ఉరి వేసుకుని దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇప్పటి వరకు ఒకరికొకరు తోడుగా ఉన్న వీరు.. మరణంలో ఇద్దరి కలిసే చనిపోయారు. 

ఒకే ఫ్యాన్‎కు ఒకే తాడుతో ఉరి వేసుకుని ప్రాణాలు విడిచారు. గమనించిన వృద్ధాశ్రమ నిర్వహకులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.తల్లిదండ్రులతో తనకు విభేదాలు ఉన్నాయని.. తన భార్యతో కూడా వారు గొడవ పడేవారని విజయ్ పోలీసులకు చెప్పాడు. 

2021లో బ్యాటరాయణపురలోని ఒక వృద్ధాశ్రమానికి వెళ్లారు. 2023లో తిరిగి ఇంటికి వచ్చారు. మళ్ళీ విభేదాలు రావడంతో2025, మే 18న వారిని  వృద్ధాశ్రమానికి పంపించానని తెలిపాడు విజయ్. లక్షల రూపాలు సంపాదిస్తూ కనిపెంచిన తల్లిదండ్రులను చివరి దశలో ఆప్యాయంగా చూసుకోవాల్సింది పోయి వారిని వృద్ధశ్రమానికి తరలించి ఆత్మహత్యకు పాల్పడేలా చేసిన విజయ్‎పై నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.