బీజేపీ ప్రచార పాటను నిషేధించిన ఈసీ

బీజేపీ ప్రచార పాటను నిషేధించిన ఈసీ

భారతీయ జనతా పార్టీకి చెందిన ఎన్నికల ప్రచార పాటను ఎన్నికల కమిషన్ బ్యాన్ చేసింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేత, కేంద్ర మంత్రి బాబుల్ సుప్రియో కంపోజ్ చేసిన ఈ పాట తృణమూల్ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉందని ఎన్నికల కమిషన్ ముఖ్య అధికారి ఒకరు తెలిపారు. ఎన్నికల కమిషన్ ధృవీకరించకుండానే ఈ పాటను విడుదల చేశారని, ఇప్పటికే ఈ పాటను వివిధ ప్రదేశాల్లో ప్రదర్శించారని ఆయన అన్నారు. ఈ పాటను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఆయన తెలిపారు.

ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్ ఈ విషయంపై ఫిర్యాదు చేసింది. దీనిపై చర్యలు తీసుకున్న ఎన్నికల కమీషన్.. మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ (ఎంసీఎంసీ) నుండి ముందస్తు అనుమతి తీసుకోకపోవడం ఎన్నికల నిబంధనను ఉల్లంఘించడమేనని అన్నారు