జమ్మూ కశ్మీర్ లో ఎదురుకాల్పులు: ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూ కశ్మీర్ లో ఎదురుకాల్పులు: ఇద్దరు టెర్రరిస్టులు హతం

జమ్మూ కశ్మీర్ బందిపోరా  సెక్టార్ లో జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. వారినుంచి భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. బందిపోరా సెక్టార్ లో ఉదయం భద్రతాబలగాలపైకి ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు దీటుగా స్పందించాయి.

అయోధ్య తీర్పువెలువడిన నేపథ్యంలో టెర్రరిస్టులు భారత్ లో దాడి చేయనున్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపాయి.  ఢిల్లీ, ఉత్తర ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో దాడులు చేసే అవకాశం ఉందని తెలిసింది.