- మట్టి గణేశ్ విగ్రహాలను ప్రోత్సహించండి
- హైకోర్టు ఆదేశాలను అమలు చేయాల్సిందే : సీఎస్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మట్టి విగ్రహాల తయారీని ప్రోత్సహించాలని అధికారులను సీఎస్ సోమేశ్కుమార్ ఆదేశించారు. సెప్టెంబర్ లో జరగనున్న గణేశ్ నిమజ్జనంపై బీఆర్కే భవన్లో సీఎస్ మంగళవారం రివ్యూ చేశారు. పర్యావరణానికి హాని కలిగించే కెమికల్స్ తో గణేశ్ విగ్రహాలు తయారు చేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు మట్టి వినాయకుల విగ్రహాలు వినియోగించే విధంగా నగర వాసులను చైతన్య పర్చాలని వివరించారు. విగ్రహాల తయారీదార్లను కూడా ఆ దిశగా ప్రోత్సహించాలని కోరారు. ఈసారి విగ్రహాలను హైదరాబాద్లోని ట్యాంక్బండ్, ఇతర చెరువుల్లో నిమజ్జనం చేయరాదని తెలిపారు. సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, స్సెషల్ సీఎస్ అర్వింద్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు ఆనంద్, మహేశ్ భగవత్, జీహెచ్ ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.