ఏందిరా ఈ పంచాయితీ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ

ఏందిరా ఈ పంచాయితీ రిలీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు రెడీ

భరత్, విషికా లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జంటగా గంగాధర దర్శకత్వంలో ఎం.ప్రదీప్ కుమార్ నిర్మించిన చిత్రం ‘ఏందిరా ఈ పంచాయితీ’.  తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యులు యూ / ఏ సర్టిఫికేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను జారీ చేశారు. ఈనెల 6న సినిమా విడుదల కాబోతోంది. ‘గ్రామీణ నేపథ్యంలో సాగే వింటేజ్ లవ్ స్టోరీ ఇది. 

ఎమోషనల్ కంటెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో పాటు క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లింగ్ అంశాలు కలగలిసిన ఎంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టైనర్. కుటుంబ సమేతంగా చూసేలా ఉంటుంది’ అని మేకర్స్ చెప్పారు. కాశీ విశ్వనాథ్, తోటపల్లి మధు, రవి వర్మ, ప్రేమ్ సాగర్, సమీర్, విజయ్, తేజ ఇతర పాత్రలు పోషించారు. పెద్దపల్లి రోహిత్ సంగీతం అందించాడు.