
ఇంగ్లాండ్తో జరుగుతోన్న ఐదు మ్యాచుల టెస్ట్ సిరీస్లో తొలి మ్యాచులో ఓడిన టీమిండియాకు భారీ గుడ్ న్యూస్. టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా రెండో టెస్ట్కు అందుబాటులోఉండనున్నాడు. ఈ విషయాన్ని టీమిండియా అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ డోస్చేట్ ధృవీకరించారు. ఎడ్బాస్టన్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్ జట్టు సెలెక్షన్కు బుమ్రా అందుబాటులో ఉన్నాడని.. నెట్ ప్రాక్టీస్లో కూడా పాల్గొన్నాడని తెలిపారు.
కానీ అతడు ప్లేయింగ్ లెవన్లో బరిలోకి దిగుతాడా లేదా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నాడు. బుమ్రా పూర్తి ఫిట్నెస్తో ఆడటానికి సిద్ధంగా ఉన్నాడని.. కానీ పని భారం, తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని రెండో టెస్ట్లో ఆడించాలా లేదా అన్న దానిపై నిర్ణయం తీసుకుంటుమన్నారు.
ఐదు మ్యాచుల సిరీస్లో బుమ్రా ఏవైనా మూడు మ్యాచులే ఆడతాడనే విషయం మాకు తెలుసని.. అందుకే అతడిని ఏ మ్యాచులో ఆడించాలనే దానిపై కసరత్తు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే తొలి టెస్ట్లో బుమ్రా ఆడాడు.. దీంతో అతడు సిరీస్లో మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఏవైనా రెండు మాత్రమే ఆడతాడు. ఎడ్బాస్టన్ వేదికగా జరగనున్న రెండో టెస్ట్కు అతడు అవసరమని భావిస్తే చివరి నిమిషంలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
గాయం, పని భారం కారణంగా ఇంగ్లాండ్తో ఐదు మ్యాచుల సిరీస్లో ఏవైనా మూడు మ్యాచుల్లో మాత్రమే బుమ్రాను ఆడించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. లీడ్స్ వేదికగా జరిగిన తొలి టెస్ట్లో బుమ్రా ఆడాడు. దీంతో సిరీస్లో అతడు మరో రెండు మ్యాచులు మాత్రమే ఆడే అవకాశం ఉంది.
దీంతో బుమ్రాను మిగిలిన నాలుగు మ్యాచుల్లో ఏ రెండు టెస్టుల్లో ఆడించాలనే దానిపై టీమిండియా మేనేజ్మెంట్ తీవ్ర కసరత్తు చేస్తోంది. 2025, జూలై 2 నుంచి ఎడ్జ్బాస్టన్ వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది. సిరీస్లో తొలి మ్యాచ్ ఓటమి చవిచూసిన నేపథ్యంలో రెండో టెస్ట్లో బుమ్రా ఆడటంపై బీసీసీఐ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.