తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు

తుపాకీతో మాజీ మంత్రి బెదిరింపులు

నల్గొండ/చిట్యాల, వెలుగు: చిట్యాల కాలువ విస్తరణ పనులు చేస్తున్న ఓ జేసీబీ డ్రైవర్ ను తుపాకీతో మాజీ మంత్రి బెదిరించిన సంఘటన చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామ శివారులో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పిలాయిపల్లి కాల్వ విస్తరణ పనులు చిట్యాల మండలంలోని పెద్ద కాపర్తి పెద్ద చెరువు మీదుగా ఉరుమడ్ల గ్రామం వరకు జరుగుతున్నాయి. ఉరుమడ్ల శివారులో మాజీ మంత్రి గుత్తా మోహన్ రెడ్డి కి చెందిన వ్యవసాయ పొలం మీదుగా కాల్వను విస్తరిస్తుండడంతో ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. తన తుపాకీతో పనులు చేస్తున్నవారిని బెదిరించారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.