పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ సూసైడ్

పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ సూసైడ్

పోలీస్ స్టేషన్ లోనే ఎక్సైజ్ కానిస్టేబుల్ సూసైడ్ చేసుకున్న సంఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది.  ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీంధ్రరావు వేధింపులు తాళలేక కానిస్టేబుల్ ఆశయ్య ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. ఇటీవల సూపరింటెండెంట్ వేధింపులు ఎక్కువ అయ్యాయని తెలుస్తోంది. శంషాబాద్ పీఎస్‌లోనే ఆశయ్య ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తమకు న్యాయం చేయాలని ఆశయ్య కుటుంబసభ్యులు కోరుతున్నారు. సూపరింటెండెంట్‌ పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టమ్ కోసం ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు.