కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన పబ్.. సీజ్ చేసిన అధికారులు

కోవిడ్ రూల్స్ బ్రేక్ చేసిన పబ్.. సీజ్ చేసిన అధికారులు

కరోనా నిబంధనలకు విరుద్దంగా నడిపిస్తున్న మాదాపూర్ లోని రిజైన్ స్కై బార్ పబ్ ను సీజ్ చేశారు ఎక్సైజ్ అధికారులు. కరోనా రూల్స్ కు విరుద్దంగా జనం గుమిగూడడం, ఫిజికల్ డిస్టెన్స్ పాటించలేదని నిర్ధారించారు. బార్లో పనిచేసే వెయిటర్లు ఎక్కడా మాస్కులు ధరించలేదని గుర్తించారు. పబ్ లో రష్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో….ఎక్సైజ్ శాఖ దర్యప్తుకు ఆదేశించింది. ఉదయం పబ్ పై రైడ్ నిర్వహించిన పోలీసులు కస్టమర్లు, సిబ్బందిని ప్రమాదంలోకి నెట్టే విధంగా యాజమాన్యం వ్యవహరించిందని నిర్ధారించి పబ్ ను సీజ్ చేశారు. ఎక్సైజ్ చట్టం సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసారు.

రోడ్డు పక్కన బంగారు నాణేలు..ఎగబడ్డ స్థానికులు

పార్టీలో నిజాయితీగా పనిచేసినందుకు అణిచివేశారు

24 గంటల్లో 66,732 కేసులు..816 మంది మృతి

తెలంగాణలో కొత్తగా 1201 కేసులు.. 6 మంది మృతి