మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నుపుర్ శర్మ

మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించిన నుపుర్ శర్మ

బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నుపుర్ శర్మ మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మహమ్మద్ ప్రవక్తపై ఆమె చేసిన వ్యాఖ్యలకు గాను దేశవ్యాప్తంగా అల్లర్లు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. కాగా అప్పట్లో ఆమెపై నమోదైన కేసుల్లో అరెస్టు నుంచి రక్షణ ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. అవే వ్యాఖ్యలను ఆమె మరోసారి గుర్తు చేశారు. సుప్రీంకోర్టు చేసిన విమర్శలతో తనకు ముప్పు ఇంకా పెరిగిందని తెలిపారు. జులై 1వ తేదీన తనపై సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల కారణంగా ఆమెపై మొత్తం 9 కేసులు నమోదయ్యాయని..ఆ తర్వాతే తనపై హత్య, అత్యాచారం బెదిరింపులు మరింత పెరిగాయని పేర్కొన్నారు. అలాగే, తనపై నమోదైన అన్ని ఎఫ్ఐఆర్‌లను ఢిల్లీకి బదిలీ చేయాలని కోరారు.