పత్తి రైతు ఆత్మహత్యాయత్నం

పత్తి రైతు ఆత్మహత్యాయత్నం

ఓ రైతు మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. తన పంట అమ్మినా వ్యాపారి డబ్బులు ఇవ్వలేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  తన పత్తి అమ్మిన డబ్బులు వ్యాపారి ఇవ్వలేదంటూ మనస్తాపంతో పురుగుల మందు తాగాడు. దీంతో ఆగ్రహించిన రైతు బంధువులు వ్యాపారిపై దాడి చేశాడు.ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ లో చోటు చేసుకుంది.సుజాతనగర్ మండలం జామ్లాతండాకు చెందిన ధారావత్. దేవ్ అనే   యువ రైతు వ్యాపారికి తన పత్తి అమ్మాడు. అయితే  పత్తి వ్యాపారి తన వద్ద పత్తి కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని మనస్తాపంతో వ్యాపారి షాపు ముందు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసాడు. 11 క్వింటాల్ పత్తికి 85000 రూపాయలు డబ్బులు ఇవ్వాల్సి ఉండగా , 5 వేలు మాత్రమే వ్యాపారి ఇచ్చి మిగత నగదు ఇవ్వకుండా కాలయాపనా చేస్తున్నాడని రైతు ఆరోపిస్తున్నాడు. ఆగ్రహించిన రైతు బంధువులు పత్తి వ్యాపారిపై దాడి చేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొని  విచారణ చేపట్టారు.

ఇవి కూడా చదవండి:

తెలంగాణలో న్యూఇయర్ వేడుకలపై ఆంక్షలు !

న్యూఇయర్ కోసం గోవా నుంచి డ్రగ్స్