పెంచిన చేతులతోనే తెంపేశాడు..

పెంచిన చేతులతోనే తెంపేశాడు..

కొండాపూర్, వెలుగు: గిట్టు బాటు ధరలేదని ఓ రైతు తన పంటను తానే ధ్వంసం చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం గొల్లపల్లిలో జరిగిన ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింహులుకు మూడెకరాల పొలం ఉంది. ఇందులో 30 గుంటల్లో వంకాయ తోట వేశాడు. పంట సాగు కోసం దాదాపు రూ.60 ఖర్చే చేశాడు. తీరా పంట చేతి కొచ్చాక కాయలు కోసుకుని మార్కెట్‌ కు వెలితే.. క్వింటాల్‌‌‌‌‌‌‌‌కు రూ.600 చొప్పున 10 క్వింటాళ్లకు రూ.6 వేలు వచ్చింది. రూ.2 వేలు ప్రయాణ ఖర్చులు పోను అతడికి మిగింది రూ.4 వేలే.. దీంతో మనస్తాపం చెందిన నర్సింహులు ఇలా తన పంటను తానే ధ్వంసం చేసుకున్నాడు.