ఊరిని వదులుతూ కన్నీరు పెట్టుకున్న రైతులు

ఊరిని వదులుతూ కన్నీరు పెట్టుకున్న రైతులు

కొండ పోచమ్మ సాగర్ ముంపు గ్రామాలు తరలివెళుతున్నాయి. చివరి సారిగా మత ఇళ్లముందు పూజలు చేసుకుని.. ఊరు వదిలి వెళ్లడానికి సిద్దమయ్యారు గ్రామస్తులు. పుట్టి పెరిగిన ఊరిని వదిలి వెళ్లాల్సి వస్తోందని కన్నీరు పెట్టుకుంటున్నారు.

మరోవైపు భూ నిర్వాసితుల కోసం తునికి బొల్లారంలో ఏర్పాటు చేసిన ఇళ్లలో సౌకర్యాలు సరిగా లేవంటున్నారు బాధితులు. ఉపాధి కూడా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.