రంగారెడ్డి జిల్లాలోని ఓ సూపర్మార్కెట్ సెల్లార్లో అగ్నిప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి రిలయన్స్ సూపర్మార్ట్సెల్లార్లో ని జనరేటర్లో జులై 07న ఉదయం ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. స్థానికులు గమనించి ఫైర్ స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు. అది రావడానికి ఆలస్యం కావడంతో మంటలు మరింతగా వ్యాపించాయి. మార్కెట్ సిబ్బంది ఫైర్సేఫ్టీ సిలిండర్లతో మంటల్ని అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేశారు.
కానీ ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి. కాసేపటికి అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ఈ ప్రమాదంలో ఎక్కువగా ఆస్తి నష్టం జరగలేదు. ప్రాణ నష్టం కూడా లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. గతంలోనూ ప్రమాదాలు జరిగిన యజమాని, అధికారులు పట్టించుకోవట్లేదని వారు ఆరోపిస్తున్నారు.