- సినీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల
సికింద్రాబాద్,వెలుగు: ప్రాణాలను లెక్క చేయకుండా ప్రమాదాల్లో ఉన్న జనాల ప్రాణాలను, ఆస్తులు కాపాడే అగ్నిమాపక సిబ్బందే రియల్ హీరోలని సినీ డైరెక్టర్శేఖర్ కమ్ముల పేర్కొన్నారు. గురువారం సికింద్రాబాద్లోని ఫైర్స్టేషన్లో జేసీఐ హైదరాబాద్ దక్కన్, అగ్ని మాపక శాఖ ఆధ్వర్యంలో అగ్ని మాపక వారోత్సవాల సందర్భంగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేశారు.
ముఖ్యఅతిథిగా హాజరైన శేఖర్కమ్ముల మాట్లాడుతూ ఎన్నో సార్లు అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పడం దగ్గరగా చూశానన్నారు. ప్రమాదాలు జరిగిన సమయాల్లో వాహనదారులు , అంబులెన్స్లకు దారి ఇచ్చినట్లుగానే ఫైరింజన్లకూ ఇవ్వాలని ఆయన సూచించారు.
చిన్నారులకు ఫైర్సేఫ్టీపై అవగాహన కల్పించాలన్నారు. జనాల్లో అవగాహన కల్పించేందుకు సినీ నటులతో మెసేజ్లు ఇప్పిస్తామని,సెలబ్రిటీలు చెపితే జనాలు బాగా వింటారన్నారు. అనంతరం అగ్ని మాపక శాఖలో సమర్ధంగా డ్యూటీలు చేసిన సిబ్బందికి మెమోంటోలు అందించారు. స్కైలిఫ్ట్ వాహనాన్ని ఎక్కి దాని పనితీరు గురించి అధికారులను అడిగారు. సికింద్రాబాద్ ఫైర్ ఆఫీసర్ మోహన్రావు, జేసీఐ అధ్యక్షుడు సందీప్ సర్దా, ప్రతినిధులు సుధీర్,అమిత్,మోనల్, విజయ్ పాల్గొన్నారు.
గండిపేట: ప్రజలు అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని రంగారెడ్డి జిల్లా అగ్నిమాపక అధికారి టి.పూర్ణచందర్ సూచించారు. రాష్ట్ర విపత్తు స్పందన, అగ్నిమాపక సేవల శాఖ ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలను రాజేంద్రనగర్లో నిర్వహించగా ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.