
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మావోయిస్ట్ పార్టీకి చెందిన నలుగురు ఏరియా కమిటీ సభ్యులతో పాటు ఓ దళ సభ్యుడు లొంగిపోయారని ఎస్పీ బి.రోహిత్ రాజ్ చెప్పారు. చత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన పూనెం పాక్లి, రవ్వ సోమ, మడివి మంగితో పాటు భద్రాద్రికొత్తగూడెం జిల్లా చర్ల మండలానికి చెందిన వెట్టి దేవ అలియాస్బాలు, మడకం ఉంది అలియాస్గంగి శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయారు. పాక్లి నాలుగేండ్లుగా మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్నారని ఎస్పీ చెప్పారు. లొంగిపోయిన వారంతా పలు విధ్వంసక ఘటనల్లో పాల్గొన్నారన్నారు.