ఫ్లోర్ లీడర్​ను రాష్ట్ర నాయకత్వం డిసైడ్ చేస్తది : రాజాసింగ్

ఫ్లోర్ లీడర్​ను రాష్ట్ర నాయకత్వం డిసైడ్ చేస్తది :   రాజాసింగ్

హైదరాబాద్, వెలుగు: బీజేపీ శాసన సభా పక్ష నేత ఎవరనేది రాష్ట్ర నాయకత్వం నిర్ణయిస్తుందని ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. బుధవారం మహారాష్ట్ర వెళ్లడంతో అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాలేకపోయానని చెప్పారు. గురువారం అసెంబ్లీ వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని, అందరితో చర్చించి ఫ్లోర్ లీడర్ పై పార్టీ నాయకత్వం ఒక నిర్ణయం తీసుకోనుందని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ఎమ్మెల్యేల సంఖ్య మరింత పెరుగుతుందని  రాజాసింగ్ ధీమా వ్యక్తం చేశారు.