పంజాగుట్ట మాజీ సీఐని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పంజాగుట్ట మాజీ సీఐని అదుపులోకి తీసుకున్న పోలీసులు

పరారీలో ఉన్న పంజాగుట్ట మాజీ ఇన్స్పెక్టర్ దుర్గారావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావుని అనంతపురం గుంతకల్లు రైల్వే స్టేషన్ లో హైదరాబాద్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ప్రజాభవన్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్గారావు నిందితుడిగా ఉన్నారు. ప్రమాదంలో భోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు  పారిపోయేందుకు దుర్గారావు సహకరించాడని ఉన్నతాధికారులు తేల్చడంతో సీపీ కొత్తకోట శ్రీనివాస్ ఆయనను సస్పెండ్ చేశారు. ఈ కేసులో భోదన్ ఇన్ స్పెక్టర్ ప్రేమ్ కుమార్ తో పాటు మరొకరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే దుర్గారావు పరారీలో ఉన్నాడు. అప్పటి నుంచి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ గుంతకల్లులో పట్టుకున్నారు.

డిసెంబర్ 24న అర్థరాత్రి ప్రజాభవన్ దగ్గర తన కారుతో భారీ కేడ్ ను ఢీ కొట్టి పరారయ్యారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే ఇన్ స్పెక్టర్ దుర్గారావు నిందితుడికి సహకరించారని ఆరోపణలు ఉన్నాయి.