లోక్ సభ ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీఎస్పీకి రెండు సీట్లను కేటాయించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నాగర్ కర్నూల్, హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్టు ప్రకటించారు. సీట్ల సర్దుబాటుపై స్పందించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ పోటీ చేసే స్థానాలతో పాటు బీఆర్ఎస్ పోటీ చేసే స్థానాల్లో కూటమి విజయం ఖాయమని ట్వీట్ చేశారు.
బీఎస్పీ పోటీ చేస్తున్న రెండు స్థానాల్లో బరిలో నిలిచే అభ్యర్థులకు బీఆర్ఎస్ నేతలు పూర్తి సహకారం అందించనున్నారు. బీఆర్ఎస్ మిగిలిన 15 స్థానాల్లో పోటీ చేస్తుంది .ఇప్పటికే 11 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. నాగర్ కర్నూలు నుంచి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బరిలోకి దిగుతారని ప్రచారం జరుగుతోంది.
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీతో బీఎస్పీ పొత్తులో భాగంగా ఇరుపార్టీలు జరిపిన చర్చల అనంతరం.. రెండు సీట్లను బీఎస్పీకి కేటాయించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు నిర్ణయించారు.
— BRS Party (@BRSparty) March 15, 2024
అందులో భాగంగా నాగర్ కర్నూల్ మరియు హైదరాబాద్ పార్లమెంటు స్థానాలను బీఎస్పీకి కేటాయిస్తున్నట్టు…