TSPSC చైర్మన్​గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి

TSPSC చైర్మన్​గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి

టీఎస్​పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియమితులయ్యారు. మహేందర్ రెడ్డి నియమాకాన్ని గవర్నర్ తమిళిసై ఆమోదించారు. అంతకుముందు ఈ పదవిలో జనార్థన్ రెడ్డి ఉండగా.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక  తన పదవికి రాజీనామా చేశారు. జనార్థన్ రెడ్డి హయాంలోనే TSPSC పేపర్లు లీక్ కావటం.. పరీక్షలు వాయిదా పడటం జరిగింది. ఈ క్రమంలోనే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం.. TSPSC ప్రక్షాళన దిశగా అడుగులు వేసింది. కొత్త ప్రభుత్వ ఆలోచనలను తెలుసుకున్న జనార్థన్ రెడ్డి.. తనకు తానుగా రాజీనామా చేశారు.

కొత్త TSPSC చైర్మన్ పదవికి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు. సమర్థత, భద్రత, విశ్వసనీయత అంశాలను పరిగణలోకి తీసుకుని TSPSC చైర్మన్ పోస్టుకు మహేందర్​రెడ్డి పేరును కాంగ్రెస్ ప్రభుత్వం సిఫార్సు చేసింది. ప్రభుత్వ సిఫార్సును ఆమోదించారు గవర్నర్ తమిళిసై.