బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్

బీజేపీలో చేరిన మాజీ క్రికెటర్
చెన్నై: వచ్చే ఏడాది మేలో తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చేరికలపై అన్ని పార్టీలు దృష్టి పెట్టాయి. తాజాగా టీమిండియా వెటరన్ క్రికెటర్ లక్ష్మణ్ శివరామకృష్ణన్ బుధవారం బీజేపీలో చేరారు. తమిళనాడు బీజేపీ ఇన్‌‌చార్జ్ సీటీ రవి ఆధ్వర్యంలో శివరామకృష్ణన్ కమల తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా శివరామకృష్ణన్‌‌ను పార్టీలోకి ఆహ్వానించిన సీటీ రవి.. రజనీకాంత్ కొత్త పార్టీ ప్రకటనను ఉపసంహరించుకోవడంపై కామెంట్ చేశారు. ‘రజనీకాంత గొప్ప నేత. ఆయనను మేం గౌరవిస్తాం. ఆయన బలాలు మాకు తెలుసు. తమిళనాడుతోపాటు జాతీయ ఆసక్తులను కాపాడటంపై ఆయన ఎప్పుడూ కట్టుబడి ఉన్నారు’ అని సీటీ రవి పేర్కొన్నారు. Tamil Nadu: Former Indian cricketer Laxman Sivaramakrishnan joins Bharatiya Janata Party in Chennai. https://t.co/bE05u082hx pic.twitter.com/U5arZLrboQ — ANI (@ANI) December 30, 2020