- త్వరలో కాంగ్రెస్లో చేరిక
హైదరాబాద్, వెలుగు : మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కొడుకు, గోషామహల్ నియోజకవర్గ బీజేపీ నేత విక్రమ్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే కాంగ్రెస్లో చేరేందుకు ఆయన రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల ఆ పార్టీ నేతలతో ఆయన చర్చలు జరిపారు. కాంగ్రెస్లో తన చేరికకు లైన్ క్లియర్ కావడంతో బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గత కొంత కాలంగా బీజేపీపై అసంతృప్తితో ఉన్న విక్రమ్..
గురువారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి తన రాజీనామా లేఖను పంపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన గోషామహల్ టికెట్ ఆశించారు. అయితే, అక్కడి నుంచి పోటీకి రాజాసింగ్ కే తిరిగి అవకాశం ఇవ్వడంతో అప్పటి నుంచి ఆయన పార్టీ రాష్ట్ర నాయకత్వంపై అసంతృప్తితో ఉన్నారు.