- హైకోర్టులో షకీల్ కొడుకు మరో పిటిషన్
హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాద ఘటనపై పంజాగుట్ట పోలీసులు తనపై పెట్టిన కేసును కొట్టేయాలంటూ బోధన్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహైల్ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు చేశారు. రెండో నిందితుడి వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని పోలీసులు తనను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని పిటిషనర్ రిట్లో తెలిపారు. రోడ్డు యాక్సిడెంట్ తో తనకు సంబంధం ఉన్నట్లు ఆధారాలు కూడా లేవని పేర్కొన్నారు.