పోలీసుల వేధింపులకు మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

పోలీసుల వేధింపులకు మాజీ సర్పంచ్ ఆత్మహత్యాయత్నం

శ్రీకాకుళం జిల్లా జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ ధనలక్ష్మీ కుమారుడు అవినాష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పోలీసులు వేధిస్తున్నారంటూ అవినాష్ ఎచ్చర్ల పోలీస్ స్టేషన్ బిల్డింగ్ మీది నుంచి దూకాడు. అయితే అవినాష్ కారు మీద పడటంతో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. తీవ్ర గాయాలైన అవినాష్‌ను వెంటనే శ్రీకాకుళం కిమ్స్‌కు తరలించారు. అవినాష్ గతంలో ఎస్ఎం పురానికి సర్పంచ్‌గా పనిచేశాడు. ఎస్ఎం పురంలోని శివాలయం విషయంలో వైసీపీ, టీడీపీ వర్గీయుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ వ్యవహారంపై పోలీసులు అవినాష్‌ను తరచూ స్టేషన్‌కు పిలిపించి మాట్లాడుతున్నారు. ఈ రోజు కూడా అవినాష్‌ను పోలీసులు పిలిపించారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన అవినాష్.. పోలీస్‌‌స్టేషన్ బిల్డింగ్ ఎక్కి పైనుంచి కిందికి దూకాడు.

For More News..

ఒకేసారి 80 మంది విద్యార్థినుల జుట్టు దానం.. ఎందుకో తెలిస్తే..

ఇంటింటికీ యాంటీ కరోనా టీం

నిజామాబాద్ ​ఎమ్మెల్సీ రేసులో కవిత

మార్చి 31 వరకు కరోనా సెలవులు