ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు సజీవ దహనం..మరో ముగ్గురికి గాయాలు

ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. నలుగురు సజీవ దహనం..మరో ముగ్గురికి గాయాలు

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రిఠాలా మెట్రో స్టేషన్ సమీపంలోని ఐదంతస్తుల బిల్డింగ్ లో మంటలు చెలరేగడంతో నలుగురు సజీవ దహనమయ్యారు. మరో ముగ్గురు గాయాలపాలయ్యారు. బుధవారం అర్ధరాత్రి రోహిణిలోని సెక్టార్–5లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ ఆవరించి స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. 

వారిచ్చిన సమాచారంతో అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పాట్ కు చేరుకున్నారు. దాదాపు16 ఫైరింజన్లతో మంటలను అదుపు చేశారు. అనంతరం నలుగురి మృతదేహాలను బయటకు తీసుకువచ్చారు. గాయపడిన ముగ్గురిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం సంభవించడానికి గల కారణాలు తెలియడం లేదని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.