ఆటోను ఢీ కొట్టిన కంటైనర్.. నలుగురు మృతి

ఆటోను ఢీ కొట్టిన కంటైనర్.. నలుగురు మృతి

 సంగారెడ్డిజిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఆందోలు మండలం చౌటకూర్ హైవే వద్ద ఆటోను కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి వచ్చిన పోలీసులు గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.