బీహార్ కాల్పుల్లో నలుగురు మావోలు హతం

బీహార్ కాల్పుల్లో నలుగురు మావోలు హతం

బీహార్ లో  పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో నలుగురు నక్సల్స్‌ హతమయ్యారు. పశ్చిమ చంపారన్‌ జిల్లా బగహా ప్రాంతంలో నక్సల్స్‌ ఉన్నారన్న సమాచారంతో పోలీసులు శుక్రవారం ఉదయం గాలింపులు చేపట్టారు. ఈ క్రమంలో ఎదురుపడ్డ నక్సల్స్‌.. పోలీసుల పైకి కాల్పులు జరిపారు. అలర్టైన పోలీసులు ఎదురుకాల్పులు జరపడంతో నలుగురు నక్సలైట్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఆపరేషన్‌లో బీహార్‌ పోలీసులతో పాలు సశస్త్ర సీమా బల్‌(SSB), స్పెషల్‌ టాస్క్‌ఫోర్స్‌(STF) బలగాలు పాల్గొన్నాయి. ఘటనా స్థలంలో మూడు లేటెస్ట్ వెపన్స్, భారీ పేలుడు పదార్ధాలు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.