కేసీఆర్​ గో బ్యాక్​..పదేండ్ల పాలనలో జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని ఫైర్​

కేసీఆర్​ గో బ్యాక్​..పదేండ్ల పాలనలో జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని ఫైర్​
  • మంచిర్యాల జిల్లా పర్యటనను వ్యతిరేకిస్తూ గోదావరి బ్రిడ్జి సాధన సమితి నిరసన 

మంచిర్యాల, వెలుగు : మాజీ సీఎం కేసీఆర్​ పదేండ్ల పాలనలో మంచిర్యాల జిల్లాకు ఒరగబెట్టిందేమీ లేదని గోదావరి బ్రిడ్జి సాధన సమితి నాయకులు విమర్శించారు. ఎంపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేసీఆర్​శనివారం నాటి జిల్లా పర్యటనను వ్యతిరేకిస్తూ 'కేసీఆర్​గో బ్యాక్' అంటూ నిరసన వ్యక్తం చేశారు. శుక్రవారం గోదావరి వద్ద  బ్రిడ్జి సాధన సమితి కన్వీనర్ తుల మధుసూదన్​రావు మాట్లాడుతూ.. 2018లో గోదావరిపై మంచిర్యాల–అంతర్గాం బ్రిడ్జి నిర్మిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చి విఫలమయ్యారని అన్నారు.

ఈ ప్రాంతంలో ఆరు అండర్​ గ్రౌండ్​ మైన్స్​ ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తానని మోసం చేశారన్నారు.కాళేశ్వరం ప్రాజెక్టు బ్యాక్​ వాటర్​ కారణంగా మంచిర్యాల టౌన్​తో పాటు జిల్లాలోని పలు గ్రామాలు, వేల ఎకరాల్లో పంటలు నీటమునిగాయని, వరద బాధితులను కేసీఆర్​ కనీసం పరామర్శించలేదని వారు ఫైర్​అయ్యారు. సింగరేణి ప్రాంతంలో ఖర్చు చేయాల్సిన సీఎస్సార్, డీఎంఎఫ్​టీ ఫండ్స్​ను గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట ప్రాంతాలకు తరలించకుపోయిన ద్రోహి కేసీఆర్​అని మండిపడ్డారు. మంచిర్యాల సిమెంట్​ కంపెనీ

శాలివాహన పవర్​ ప్లాంట్​ను మూసివేయడంతో వేల మంది కార్మికులు రోడ్డున పడ్డా.. కేసీఆర్​ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. జిల్లాకు అడుగడుగునా అన్యాయం చేసిన కేసీఆర్ మరోసారి ఏం మొఖం పెట్టుకొని ఓట్లు అడగడానికి వస్తున్నారని వారు ప్రశ్నించారు. కార్యక్రమంలో నల్ల నాగేంద్ర ప్రసాద్, కలకుంట్ల మల్లయ్య, బానోత్​ దాస్య, ఐ.శివకుమార్ పాల్గొన్నారు.