‘డబుల్’ ఇండ్లను అమ్మకుంటే రద్దు చేస్తాం : ఆదిలాబాద్ కలెక్టర్రాజర్షి షా

‘డబుల్’ ఇండ్లను అమ్మకుంటే రద్దు చేస్తాం : ఆదిలాబాద్  కలెక్టర్రాజర్షి షా
  •     కలెక్టర్​రాజర్షి షా హెచ్చరిక
  •     లబ్ధిదారులకు రశీదుల పంపిణీ

ఆదిలాబాద్​ టౌన్, వెలుగు: నిరుపేదలకు ప్రభుత్వం ఉచితంగా అందజేసిన డబుల్​బెడ్రూం​ ఇండ్లను విక్రయించినా, అద్దెకు ఇచ్చినా కేటాయింపులను రద్దు చేస్తామని ఆదిలాబాద్​కలెక్టర్​ రాజర్షి షా హెచ్చరించారు. ఆదిలాబాద్​లోని 6వ వార్డు నుంచి 16వ వార్డుల్లోని డబుల్​బెడ్రూం లబ్ధిదారులకు శుక్రవారం మున్సిపల్​కార్యాలయంలో చైర్​పర్సన్​బండారి అనూషతో కలిసి రశీదులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్​మాట్లాడుతూ.. వార్డుల వారీగా అర్హులైన లబ్ధిదారులను పూర్తి పారదర్శకతతో లక్కీ డ్రా విధానంలో ఎంపిక చేసినట్లు చెప్పారు. 

ప్రస్తుతం కేఆర్‌‌కే కాలనీ, మావల ప్రాంతాల్లో డబుల్ బెడ్రూం ఇండ్లను కేటాయిస్తున్నామని తెలిపారు. త్వరలో జిల్లా ఇన్‌‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా లబ్ధిదారులకు అధికారిక ప్రొసీడింగ్స్ కాపీలను అందజేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో అడిషనల్​కలెక్టర్​రాజేశ్వర్, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్, కౌన్సిలర్లు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.