- రౌస్ అవెన్యూ కోర్టులో కవిత పిటిషన్
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించారు. తాను కోర్టుకు నేరుగా హాజరయ్యేందుకు అనుమతివ్వాలని ఆమె తరఫున అడ్వకేట్ మోహిత్ రావు పిటిషన్ వేశారు.
గత నెల 23న జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు సందర్భంగా తీహార్ జైలు నుంచి కవిత వర్చువల్ గా హాజరయ్యారని, ఈ సారి ఆమె కోర్టు ముందు నేరుగా హాజరుకావాలని కోరుకుంటున్నట్టు పిటిషన్ లో పేర్కొన్నారు.