మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం కోయిల్సాగర్ ప్రాజెక్టులో మంగళవారం ఓ మత్స్యకారుడికి పాము లాంటి చేప చిక్కింది. అతని వద్ద నారాయపేట జిల్లా మరికల్ కు చెందిన శేఖర్ అనే వ్యాపారి కొని మార్కెట్లో అమ్మేందుకు తీసుకొచ్చాడు. 9 కిలోల బరువు ఉన్న పాము లాంటి చేపను మలుగుమియా చేపగా పిలుస్తారు. ఈ చేపను స్థానికులు ఆసక్తిగా తిలకించారు.
-మరికల్, వెలుగు
