బెల్లంకొండ గణేష్, వర్ష బొల్లమ్మ జంటగా లక్ష్మణ్ కె. కృష్ణ దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన చిత్రం ‘స్వాతిముత్యం’. దసరా కానుకగా అక్టోబర్ 5న సినిమా రిలీజ్ అవుతున్న సందర్భంగా నిన్న హైదరాబాద్లోని శిల్ప కళావేదికలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ముఖ్య అతిథులుగా హాజరైన హీరోలు నవీన్ పోలిశెట్టి, సిద్ధు జొన్నలగడ్డ, బెల్లంకొండ సాయి శ్రీనివాస్లు సినిమా సక్సెస్ సాధించాలని టీమ్కి బెస్ట్ విషెస్ చెప్పారు. గణేష్ మాట్లాడుతూ ‘ఈ సినిమా నాకు మంచి డెబ్యూ అవుతుందనుకుంటున్నా. ఇలాంటి బ్యూటీఫుల్ స్ర్కిప్ట్ చెప్పిన లక్ష్మణ్కి థ్యాంక్స్. నాగవంశీ గారికి రుణపడి ఉంటాను. వర్ష చాలా సపోర్ట్ చేసింది. ప్రతి ఒక్కరూ తమ క్యారెక్టర్ని ప్రేమించి చేశారు.
మహతి స్వరసాగర్ మ్యూజిక్ ప్లస్ అయ్యింది. దసరాకు వస్తున్న మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నా’ అన్నాడు. ‘గణేష్ క్యారెక్టర్ నిజంగానే ‘స్వాతిముత్యం’. సితార బ్యానర్లో నటించడం నా కెరీర్కి హెల్ప్ అవుతుంది’ అంది వర్ష బొల్లమ్మ. డైరెక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ‘నన్ను నమ్మిన గణేష్కి, నాగవంశీ అన్నకు థ్యాంక్స్. భాగ్యలక్ష్మి పాత్రలో వర్ష బాగా చేసింది. దర్శకుడిగా నన్ను ఇన్స్పైర్ చేసిన త్రివిక్రమ్ గారి సపోర్ట్తో నా ఫస్ట్ మూవీ రావడం అదృష్టం’ అన్నాడు. ‘నవ్వుతూ థియేటర్కి రండి. ఎవర్నీ ఈ మూవీ డిజప్పాయింట్ చేయదు’ అన్నారు నాగవంశీ. దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత చినబాబు కార్యక్రమంలో పాల్గొన్నారు.