టీమిండియా మాజీ క్రికెటర్‌‌కు కరోనా పాజిటివ్

టీమిండియా మాజీ క్రికెటర్‌‌కు కరోనా పాజిటివ్

దేశంలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. ప్రతి రోజు రెండు నుంచి మూడు లక్షల వరకు కొత్తగా కేసులు నమోదవుతున్నాయి. థర్డ్ వేవ్‌లో సామాన్యలు నుంచి సెలబ్రెటీల వరకూ ఎవరినీ కరోనా మహమ్మారి విడిచి పెట్టడం లేదు. పలువురు ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, రాష్ట్రాల మంత్రులు, ఎమ్మెల్యేలు, సినిమా, క్రికెట్ స్టార్లు భారీ సంఖ్యలోనే కొవిడ్ బారినపడ్డారు. తాజాగా మాజీ క్రికెటర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌‌కు కరోనా పాజిటివ్ వచ్చింది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు.


మైల్డ్ సింప్టమ్స్ కనిపించడంతో కరోనా టెస్టు చేయించుకున్నానని, పాజిటివ్ అని నిర్ధారణ అయిందని గంభీర్ తెలిపారు. కొద్ది రోజులగా తనను కలిసిన వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే టెస్టులు చేయించుకోవాలని సూచించారు.