
న్యూఢిల్లీ: తన తల్లి అనారోగ్యం కారణంగా స్వదేశానికి వచ్చిన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఇంగ్లండ్కు తిరుగుపయనం అవుతున్నాడు. మంగళవారం టీమిండియాతో కలవనున్న గౌతీ ఈ నెల 20 నుంచి లీడ్స్ వేదికగా ఇంగ్లండ్తో మొదలయ్యే తొలి టెస్టుకు ముందు జట్టుకు మార్గనిర్దేశం చెయనున్నాడు. ‘ప్రస్తుతం గంభీర్ తల్లి ఆరోగ్యం నిలకడగా ఉంది. మంగళవారం బయలుదేరి అదే రోజు జట్టుతో కలుస్తాడు’అని బీసీసీఐ సీనియర్ అధికారి తెలిపారు.
గంభీర్ గైర్హాజరీలో బెకెన్హామ్లో ఇండియా, ఇండియా–ఎ జట్ల మధ్య జరిగిన ఇంట్రా-స్క్వాడ్ ప్రాక్టీస్ మ్యాచ్ను అసిస్టెంట్ కోచ్ ర్యాన్ టెన్ దష్కటే, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్, బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ పర్యవేక్షించారు.