- యాదాద్రి జిల్లాకు చెందిన నిందితుడు అరెస్ట్
ఘట్ కేసర్, వెలుగు : రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తుండగా.. ఓ వ్యక్తిని అరెస్టు చేసి 25 క్వింటాళ్ల బియ్యం, లారీని ఘట్ కేసర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. శివారెడ్డి గూడ లో ఓ లారీలో రేషన్ బియం తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అక్కడికి వెళ్లారు. లారీతో పాటు అందులోని 25 క్వింటాళ్ల బియ్యం స్వాధీనం చేసుకున్నారు.
యాదాద్రి జిల్లా తుర్కపల్లి మండలం మార్కాపురం గ్రామానికి చెందిన భూక్య రాజేందర్ ను అరెస్టు చేశారు. రేషన్ షాపు నుంచి తరలిస్తున్నాడా లేక లబ్ధిదారుల నుంచి కొనుగోలు చేశాడనేదానిపై విచారణ చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రేషన్ బియ్యం కోళ్ల ఫామ్ , ఇటుక బట్టీల్లో కార్మికులకు అమ్ముతున్నట్లు నిందితుడు తెలిపారు. కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.