ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం

ఇవాళ జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం

ఇవాళ జీహెచ్ఎంసీ రెండో ప్రత్యక్ష కౌన్సిల్ సమావేశం జరుగనుంది. కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన రెండో సమావేశం జరుగుతోంది. ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సమావేశం ప్రారంభం కానుంది. సమావేశానికి 150 మంది నగర కార్పొరేటర్లు హాజరు కానున్నారు. ఈ సమావేశంలో 2022, 23 సంవత్సర బడ్జెట్ కు ఆమోదం తెలపనున్నారు. ఇప్పటికే కౌన్సిల్ లో  చర్చించేందుకు ఒక్కో కార్పొరేటర్లు 3 ప్రశ్నల లిస్ట్ సమర్పించగా, వాటి నుంచి మేయర్ 22 ప్రశ్నలు సెలెక్ట్ చేసిన్నట్లు తెలుస్తోంది. తమ డివిజన్ లో  ఉన్న సమస్యలు, అప్పుల్లో జిహెచ్ఎంసి, బల్దియా పై  ప్రభుత్వం చిన్న చూపు వంటి అంశాల పై చర్చించేందుకు సిద్ధమయ్యారు బిజేపీ, ఎంఐఎం, కాంగ్రెస్ కార్పొరేటర్లు.

జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కొలరెక్టల్‌‌ క్యాన్సర్‌‌‌‌!

పాక్ లో వెంటనే ఎన్నికలు నిర్వహించండి