హైదరాబాద్ జీహెచ్ఎంసీ పోలింగ్ నేపథ్యంలో పలువురు రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్ .. సాయంత్రం ఆరుగంటలకు ముగియనుంది. గత ఎన్నికలతో పోలిస్తే.. ఈ ఏడాది పోలింగ్ శాతం తక్కువగా నమోదౌతున్నట్లు తెలుస్తోంది. కరోనా భయంతో ప్రజలు ఓటు వేయడానికి కూడా రావడం లేదా అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.
ఈ క్రమంలో సినీ నటుడు రాజశేఖర్ దంపతులు నగరంలోని ఓ పోలింగ్ బూత్ లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇటీవల కరోనా బారిన పడి కోలుకున్న ఆయన.. ఓటర్లను చైతన్య పరిచేలా ఓటు వేసినట్టు మీడియాకు తెలిపారు. సతీమణి జీవిత తో కలసి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.