మౌనిక కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని అందించిన మేయర్

 మౌనిక కుటుంబానికి రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని  అందించిన మేయర్

మ్యాన్‌హోల్‌లో  పడి చనిపోయిన చిన్నారి మౌనిక కుటుంబానికి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అండగా నిలిచారు.  మౌనిక కుటుంబానికి జీహెచ్ఎంసీ తరపున రూ.2 లక్షల ఆర్థిక సహాయాన్ని  అందించారు. ఈ మేరకు  మౌనిక కుటుంబానికి ఆమె  చెక్కును అందజేశారు. తమ బిడ్డను తలుచుకుంటూ రోదిస్తున్న మౌనిక తల్లిదండ్రులను మేయర్ ఓదార్చారు. అన్నీ రకాలుగా అండగా ఉంటామని ఈ సందర్భంగా ఆమె వారికి హామీ ఇచ్చారు. 

అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా మౌనిక కుటుంబానికి రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేసింది. మంత్రి త‌ల‌సాని మౌనిక కుటుంబ సభ్యులకు వారి నివాసంలో చెక్కును అందజేశారు. ఈ  ఘటనపై విచారణ  జరిపిస్తామని ఆయన  స్పష్టం చేశారు. 

 పాల ప్యాకెట్ కోసం బయటకు వచ్చిన చిన్నారి మౌనిక  ప్రమాదవశాత్తూ మ్యాన్‌హోల్‌లో పడి దురదృష్టవశాత్తు  ప్రాణాలు కోల్పోయింది.   చివరకు పార్క్ లైన్ మ్యాన్‌హోల్ వద్ద చిన్నారి మృతదేహాం లభ్యమైంది. ఈ ఘటన అందరినీ కలచివేసింది. చిన్నారి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. పోస్టుమార్టం పూర్తయిన తర్వాత మౌనిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు.