కులాంతర వివాహం చేసుకున్నందుకు దాడి

కులాంతర వివాహం చేసుకున్నందుకు దాడి

అబ్బాయిని కొట్టి అమ్మాయిని తీసుకెళ్లిన బంధువులు

మేడ్చల్,వెలుగు: కులాంతర వివాహం వివాహం చేసుకున్నందుకు అబ్బాయి ఇంటిపై దాడి చేసి అమ్మాయి బంధువులు ఆమెను తీసుకెళ్లారు. ఈ ఘటన మేడ్చల్ పీఎస్ పరిధిలో జరిగింది. మండల పరిధిలోని డబీల్పూర్ గ్రామానికి చెందిన ఉడ్డు సందీప్ (25) అదే గ్రామానికి చెందిన కొత్త ప్రియాంక (20) ఏడాదిన్నరగా లవ్ చేసుకుంటున్నారు. వీరిద్దరి కులాలు వేరు కావడంతో ఇంట్లో పెద్దలు ఒప్పుకోరని డిసెంబర్ 8న ఆర్యసమాజ్ లో లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. వేరే ప్రాంతంలో ఉంటున్న వీరిపై అమ్మాయి తరఫు బంధువులు గతంలో దాడులు చేసేందుకు యత్నించారు.  2 రోజుల క్రితం సందీప్, ప్రియాంక గ్రామానికి వచ్చారు.

ఆదివారం రాత్రి  ప్రియాంక కుటుంబసభ్యులు సందీప్ ఇంటిపై దాడి చేశారు. కులం పేరుతో సందీప్ ను తిట్టారు. అతడిని కొట్టి ఇంట్లో ఉన్న రూ.3లక్షల75 వేలను తీసుకున్నారు. ప్రియాంకను కూడా వారు తీసుకెళ్లినట్టు సందీప్ పోలీసులకు ఇచ్చిన కంప్లయింట్ లో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గంగాధర్ తెలిపారు.

girls-family-attack-on-a-boys-home-for-inter-caste-marriage